Advertisement

మహేష్‌ను ఇరకాటంలో పడేసిన కృష్ణ!

మహేష్ నటించిన ‘1’ (నేనొక్కడినే), ఆగడు చిత్రాల బడ్జెట్ 70 కోట్లు దాటడం...ఆ చిత్రాలు అపజయాలుగా మిగిలిపోవడంతో... మహేష్‌బాబు బడ్జెట్ కంట్రోలింగ్‌పై దృష్టి పెట్టాడని, అందుకు ఆయన కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘శ్రీమంతుడు’ చిత్రం కోసం పారితోషికాన్ని భారీగా తగ్గించుకున్నాడని..సీనియర్ నటుడు కృష్ణ పత్రికల వారికి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వెల్లడించి మహేష్‌ను ఇరకాటంలో పడేశాడని అంటున్నాయి సినీవర్గాలు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయకుడు పవన్‌కళ్యాణ్. ఆ తర్వాత స్థానం మహేష్‌దే. కాగా మహేష్ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే ఆ స్థానంలో మరో కథానాయకుడు వచ్చి చేరతాడని మహేష్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.అంతేకాదు తన రెమ్యూనరేషన్ టాపిక్‌పై కృష్ణ పత్రికల వారితో మాట్లాడటం విషయంలో మహేష్ కాస్త అసంతృప్తిగా వున్నాడట..

mahesh babu
krishna
remuneration
mahesh babu feel