Advertisement

మాట తప్పుతోన్న దర్శకులు!

మన స్టార్‌ హీరోలు మాట తప్పుతున్నారు. వారి మాటలు నీటిపై రాతలను తలపిస్తున్నాయి. ‘లెజెండ్‌’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌తో చిత్రం చేయాల్సిన బోయపాటి ఇప్పుడు బన్నీకి సై అన్నాడు. మహేష్‌తో త్వరలో సినిమా తీస్తున్నానని ప్రకటించిన వినాయక్‌ ఆ విషయం మర్చిపోయి ప్రస్తుతం అఖిల్‌ చిత్రానికి దర్శకత్వం చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ ఏడాదే మహేష్‌తో సినిమా చేస్తానని చెప్పిన త్రివిక్రమ్‌ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. పూరీ జగన్నాథ్‌ వరుణ్‌తేజ్‌తో సినిమా చేస్తున్నానని చెప్పినప్పటికీ ప్రస్తుతం ‘జ్యోతిలక్ష్మీ’,  తర్వాత కన్నడ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు. దీంతో వరుణ్‌తేజ్‌ కూడా క్రిష్‌ దర్శకత్వంలో ‘కంచె’, ఆ తర్వాత ‘బెంగుళూర్‌ డేస్‌’కు కమిట్‌ అయ్యాడు. ఇలా మన డైరెక్టర్లు ఎప్పుడు ఎవరితో సినిమా చేస్తారో అర్థం కాని పరిస్థితి ఏర్పడిరది.

directors
tollywood
boyapati srinu
vinayak
puri jagannath