ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
లేటయిన రెండింటితో వస్తాడట..!

గతేడాది 'ఎవడు', 'గోవిందుడు అందరివాడేలే' వంటి రెండు చిత్రాలతో వచ్చిన రామ్ చరణ్ 'గోవిందుడు' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆయన నటించాల్సిన శ్రీనువైట్ల చిత్రం ఇంకా ప్రారంభంకాలేదు. దాంతో ఈ ఏడాది ఒకే సినిమాతో సరిపెట్టుకుంటాడని అందరు భావించారు. అయితే రామ్ చరణ్ మాత్రం ఈ ఏడాది కూడా రెండు చిత్రాలతో అభిమానుల ముందుకు వస్తానని మాట ఇస్తున్నాడు. అంటే ఈ ఏడాది ఆయన శ్రీనువైట్ల చిత్రం తోనే కాక కోనవెంకట్, గోపీమోహన్ లు రచన చేస్తున్న సురేంద్ర రెడ్డి సినిమాని కూడా ఇదే ఏడాది పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వస్తాననే ధీమాతో రామ్ చరణ్ ఉండటంతో ఆయన అభిమానులు ఆనందంగా ఉన్నారు.
ram charan
sreenuvaitla
gopi
kona venkat
surendar reddy







































