Advertisement

మరోసారి హాట్ టాపిక్ గా మారిన ఛార్మి - దేవిశ్రీ..!

జీ తెలుగు ఛానెల్ లో ప్రసారమవుతోన్న 'కొంచెం టచ్ లో ఉంటే చెబుతా..' ప్రోగ్రాంకు గెస్ట్ గా వచ్చిన ఛార్మి పలు సెన్సేషనల్ కామెంట్స్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో అర్జెంటుగా పెళ్లి చేసుకోవాల్సిన సెలబ్రిటీ ఎవరు? అని అడిగిన ప్రశ్నకు ఛార్మి సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ పేరు చెప్పింది. గతంలో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందన్న వార్తల నేపధ్యంలో ఆమె కామెంట్స్ చర్చనీయాంశం  అయ్యాయి. ఈ ప్రోగ్రాంలో ఆమె ఒక్క దేవిశ్రీ గురించే కాదు ఇలియానా పై కూడా వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో పెద్ద సినిమాల్లో ఆమెకు అవకాశం రావడం లేదు. చిన్నాచితకా సినిమాలు చేస్తూ కెరీర్ ను అలా లాగించేస్తోంది. కానీ ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యల ద్వారా ఆమె నిత్యం వార్తల్లో ఉండాలని తాపత్రయపడుతోందని అంటున్నారు. 

zee telugu
konchem touch lo unte cheptha
guest
charmi
tollywood
most eligible bachelor
devi sri prasad
program
comments
career
vaarthalu