ఆది సాయికుమార్ నటించిన రీసెంట్ సూపర్ హిట్ మూవీ శంబాల ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కు ఒక రోజు ముందుగానే ఎర్లీ యాక్సెస్ తో ఈ సినిమాను చూడొచ్చు. ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ అందిస్తున్న ఆహా ఓటీటీ.. శంబాలతో మరోసారి కొత్త సబ్ స్క్రైబర్స్ ను ఆకర్షిస్తోంది.
గతేడాది డిసెంబర్ 25న శంబాల సినిమా మిస్టికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులు ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు యుగంధర్ ముని రూపొందించారు. అర్చన ఐయ్యర్ హీరోయిన్ గా నటించింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు.
ఈ మూవీకి ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్స్ లో మంచి వసూళ్లు సాధించిన శంబాల సినిమాను ఆహా ఓటీటీలో ప్రీమియర్ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.




సంక్రాంతి హిట్స్ - హీరోయిన్స్ సేఫ్
Loading..