రాశి ఖన్నాకి ఆల్ ది బెస్ట్ అంటున్న హీరోయిన్?

టాలెంటెడ్ బ్యూటీ అదితి రావు హైదరి విజయ్ సేతుపతి తుగ్లక్ దర్బార్ సినిమాలో తానూ నటించట్లేదు అని తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమతో సహా ప్రపంచం సినీ లోకమే గత 6-8 నెలలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దశలవారీగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్స్ ను మొదలుపెట్టారు. పని లేక నటీనటులు ఎవ్వరూ వేచి ఉండకూడదని నేనుకోరుకుంటున్నాను.
అలాగే నేను ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ప్రాజెక్ట్లను పూర్తి చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. అలాగే ప్రారంభించని ప్రాజెక్ట్ లు కూడా ఏ మాత్రం నా వల్ల ఆలస్యం కాకూడదనుకుంటున్నాను. అందుకే నేను పని చేయాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుత కొన్న కారణాలను దృష్టిలో ఉంచుకుని, నిర్మాత, సెవెన్ స్క్రీన్ స్టూడియోకు చెందిన మిస్టర్ లలిత్ కుమార్ నిర్మాణంలో విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు డిల్లీ ప్రసాద్ దర్సకత్వంలో రానున్న ప్రాజెక్ట్ నుండి తప్పకుంటున్నాను.
దర్శకుడు డిల్లీ ప్రసాద్, విజయ్ సేతుపతి మరియు తుగ్లక్ దర్బార్ మొత్తం బృందంకు మంచి జరగాలని.. వారు చాల ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను చేయాల్సిన పాత్రను చేయబోతున్న రాశి ఖన్నాకు ఆల్ ది బెస్ట్. త్వరలో ఈ సినిమా ద్వారా మీ అందరినీ థియేటర్లో చూస్తాను. అప్పటి వరకు, సురక్షితంగా ఉండండి, జాగ్రత్త వహించండి" అంటూ అతిధి తెలిపింది.
Aditi Rao Hydari released a statement on her not being a part of Vijay Sethupathi's Tughlaq Darbar
Raashi Khanna replaces Aditi Rao Hydari in Vijay Sethupathis Tughlaq Durbar







































