ఊపందుకున్న ‘గబ్బర్‌’ ప్రమోషన్‌!

CineJosh news

తమిళంలో ‘రమణ’ గా వచ్చి సూపర్‌హిట్టు అందుకున్న చిత్రం తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ‘ఠాగూర్‌’గా ఘనవిజయం సాదించింది. ఇదే సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ హీరోగా శృతిహాసన్‌, కరీనాకపూర్‌లు హీరోయిన్లుగా ‘గబ్బర్‌’గా రూపొంది విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రానికి మన తెలుగు దర్శకుడు క్రిష్‌ డైరెక్టర్‌ కావడం విశేషం. ఈ చిత్రం ప్రమోషన్‌  రోజు రోజుకు ఊపందుకొంటోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్‌, ఆడియో అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ చిత్రానికి భారీ ఎత్తున ప్రమోషన్‌ చేస్తున్నారు. ఆర్‌ఐపి కరెప్షన్‌ పేరుతో ప్రమోషన్‌ మొదలైంది. ఇక ఈ చిత్రంలోని ‘ఆవో రాజా ’ పాట అదరగొడుతోంది. ఈ పాటను ఐటం సాంగ్‌గానే కాకుండా ప్రమోషనల్‌ సాంగ్‌గా కూడా వాడుకుంటున్నారు. ఈ పాటకు చిత్రాంగధ సింగ్‌ చిందులేసింది. అలాగే కరీనాకపూర్‌ వానపాటకు కూడా మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. మరి ఈ చిత్రం బాలీవుడ్‌లో ‘రమణ, ఠాగూర్‌’లాగా సంచలనం సృష్టించి అక్షయ్‌కుమార్‌, క్రిష్‌లకు ఎంతటి పేరును తెస్తుందో చూడాలి...!

akshay kumar
krish new movie
gabbar
tagore
ramana
movie remake