రాకింగ్ స్టార్ యశ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండిమా మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. మార్చి 19న ఈ మూవీ వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ కానుంది. రిలీజ్కు ముందే ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ను క్రియేట్ చేస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను రూ.120 కోట్ల (అడ్వాన్స్ ఆన్ కమీషన్ బేసిస్)కు సొంతం చేసుకోవటం ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్గా మారింది. నాన్ తెలుగు సినిమాకు కోసం జరిగిన ఆల్టైమ్ బిగ్గెస్ట్ డీల్గా మారింది.
ఈ ఏడాది విడుదల కానున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీగా టాక్సిక్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో టాక్సిక్ నిర్మాతల(కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్)కు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్కు మధ్య ఈ హిస్టారికల్ డీల్తో సినిమాపై బజ్ మరింతగా పెరిగింది. సినిమా రూపొందుతోన్న స్కేల్, సినిమాపై ఉన్న క్యూరియాసిటీ, బాక్సాఫీస్ రేంజ్పై ట్రేడ్పై ఉన్న గట్టి నమ్మకాన్ని ఇది మరింత స్పష్టంగా తెలియజేస్తోంది. ఏపీ, తెలంగాణ హక్కుల కోసం మూడు అగ్ర సంస్థలు పోటీ పడగా చివరకు దిల్ రాజు నేతృత్వంలోని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్కు ఈ డీల్ దక్కింది. దీంతో ఇటీవల ఇండియన్ సినీ హిస్టరీలో అత్యంత కీలకమైన డిస్ట్రిబ్యూషన్ డీల్స్లో ఒకటిగా నిలిచింది.
రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్ సినిమా అనేది నిజమైన స్టార్ పవర్, విజన్, భారీ స్థాయి సినీ ఆలోచన ఉంటే భాష పరమైన హద్దులు ఎలా తొలగిపోతాయోనని చూపించే బలమైన ఉదాహరణగా నిలుస్తోంది. బయటకు కనిపిస్తోన్న మూవీకున్న హైప్, దేశాలు దాటిన అభిమానుల నుంచి వస్తోన్న రెస్పాన్స్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తోన్న భారీ స్పందన ఇవన్నీ చూస్తుంటే సినిమా ప్రారంభమైనప్పటి నుంచే దీనికి ఊహించని స్థాయిలో భారీ బజ్ క్రియేట్ అయ్యిందనే దానికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ప్రాంతాలకు అతీతంగా యశ్కు వస్తోన్న ఆదరణ చూస్తుంటే ఓ స్టార్ హీరో కోసం దేశం యావత్తు ఏకమవుతోందనే అరుదైన ఫీలింగ్ కలుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులైతే యశ్ను మనవాడనే అభిమానంతో ఆదరిస్తున్నారు. కెజియఫ్ 2 తర్వాత యశ్ నెక్ట్స్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే విషయం ఇప్పుటికే నెంబర్స్ రూపంలో, ప్రీ రిలీజ్ హైప్ రూపంలో స్పష్టంగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు మాట్లాడుతూ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోని పెద్ద స్టార్స్లో యశ్ ఒకరు. కెజియఫ్ 2 తర్వాత ఆయన మార్కెట్ మరింతగా పెరిగింది. ఆయన నెక్ట్స్ సినిమా టాక్సిక్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత వస్తోన్న ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీని మా ఎస్వీసీ బ్యానర్పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుండటం చాలా ఆనందంగా ఉంది. యశ్తో ఇలాగే మరిన్ని సినిమాలు చేయాలని ఆశిస్తున్నాం అన్నారు.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్తో భాగస్వామ్యం కావటం వల్ల టాక్సిక్ సినిమాపై నమ్మకం మరింతగా పెరిగింది. అందుకు కారణం దిల్ రాజు నేతృత్వంలోని ఎస్వీసీ బ్యానర్కు ఎన్నో భారీ చిత్రాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందించి ఘన విజయాలను సాధించింది. నేషనల్ అవార్డ్స్ సాధించిన సినిమాలు, బ్లాక్ బస్టర్స్ సాధించిన సినిమాలను రూపొందించిన ఈ సంస్థపై ట్రేడ్ వర్గాల్లో మంచి నమ్మకం ఉంది. టాక్సిక్ సినిమాతో ఎస్వీసీ బ్యానర్ జత కట్టటం అనేది కథ, స్కేల్, భారీగా థియేటర్స్లో సినిమా రన్ కావటం అనే అంశాలపై ఉన్న నమ్మకాన్ని మరింత స్పష్టం చేసింది. సినీ ఇండస్ట్రీకి ఏపీ, తెలంగాణ ప్రాంతాలు ఎంతో కీలకమైనవి. కారణం, ఇక్కడ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు, గుండెల్లో పెట్టుకుంటారు. కాబట్టి ఈ భాగస్వామ్యం టాక్సిక్ సినిమా ప్లస్ అయ్యింది. ఈ పార్ట్నర్షిప్తో ప్రేక్షకులకు భారీ రిలీజ్, స్ట్రాంగ్ ప్రమోషన్లు, థియేటర్లో ఫుల్ మాస్ ఫీలింగ్ గ్యారంటీ అనే ఫీలింగ్ వచ్చింది.
యశ్, గీతూ మోహన్దాస్ కలిసి కథను రాసి.. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్న టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్ సినిమాను ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలున్నాయి.





అనగనగ ఒక రాజు ఓటీటీ కొచ్చేస్తుంది 
Loading..