Advertisement

ఆడియో వివాదంలో మరో సీఎమ్‌..!!

Sat 27th Jun 2015 08:24 AM
shivraj singh chouhan,audio,controversy,madhya pradesh  ఆడియో వివాదంలో మరో సీఎమ్‌..!!
ఆడియో వివాదంలో మరో సీఎమ్‌..!!
Advertisement

ఓటుకు నోటు కేసులో టీడీపీ ఇరుక్కున నాటినుంచి ఫోన్‌లో అంతర్గత విషయాలను మాట్లాడటానికి నాయకులు జంకుతున్నారు. తాము ఏది మాట్లాడితే.. ఎక్కడ ట్యాపింగ్‌ అవుతుందోనని వారు ముఖాముఖి వ్యవహారాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక చంద్రబాబును పక్కనపెడితే మరో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ట్యాపింగ్‌ వ్యవహారంలో చిక్కుకున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌కు సంబంధించి విడుదలైన ఆడియో ఆ రాష్ట్రంలో ప్రకపంనలు సృష్టిస్తోంది.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గరోత్‌ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే మృతిచెందారు. ఆ సీటులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి ఆపార్టీనుంచి అనేకమంది పోటీపడ్డారు. వారిలో రాజేష్‌చౌదరి అనే వ్యక్తి కూడా ఈ సీటు కోసం తీవ్రంగా పోటీపడ్డారు. అయితే ఆయన్ను బుజ్జగించడానికి రంగంలోకి దిగిన శివరాజ్‌సింగ్‌ ఇప్పటికి టికెట్‌ వదులుకుంటే భవిష్యత్తులో ఆయన కులానికి మంచి పదవినిస్తానంటూ ఆఫర్‌ ఇచ్చారు. అయితే ఈ బుజ్జగింపుల ఆడియోసీడీ ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకుల చేతిలోకి వచ్చింది. దీన్ని బయటపెట్టిన కాంగ్రెస్‌ శివరాజ్‌పై తీవ్ర విమర్శలకు దిగారు. అయితే తాను మాట్లాడింది ఎవరు రికార్డ్‌ చేశారన్నది ఇప్పుడు శివరాజ్‌సింగ్‌కు అంతుపట్టకుండా ఉంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement