సినిమాల విషయంలో తన పని చూసుకునే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ రాజకీయంగా మాత్రం ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ ని క్రియేట్ చేస్తూనే ఉంటారు. తాజాగా శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. కేరళ సాహిత్యోత్సవం సభ సంధర్బంగా జనవరి 22 తేదిన నిర్వహించిన What India Loses When South India is Undermined? ఆనే అంశం పై నిర్వహించిన సభలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..
శ్రీరాముడు మరియు లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కూలీలు, వనవాసం సమయంలో దక్షిణ భారతంలో అడుగుపెట్టి ఇక్కడి పండ్లు కోసుకొనితినడంతో దక్షిణాది గిరిజన రాజు ( రావణాసురుడు ) ఆ పండ్లకు ఖరీదు చెల్లించాలి అని అడిగితే శూర్పణఖ ముక్కు కోసాడు శ్రీరాముడు అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసాడు.
అప్పటి వీడియోస్ ఇప్పుడు వైరల్ అవడంతో ప్రకాష్ రాజ్ పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు, ఈ విడియో లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డిల్లీకి చెందిన న్యాయవాది అమితా సచ్దేవా, ప్రకాష్ రాజ్ పై కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.




టాక్సిక్ టాప్ సీక్రెట్ రివీల్ చేసిన యశ్
Loading..