బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగం 2026 దివాళి కి విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ తో సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, కన్నడ స్టార్ హీరో యష్ రావణా గా కనిపించనున్నారు.
తాజాగా యష్ టాక్సిక్ ప్రమోషన్స్ లో భాగంగా రామాయణ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రణబీర్ కపూర్ అద్భుతమైన నటుడు. సినిమా విషయంలో మా ఇద్దరి విజన్, ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. అయితే రామాయణ సినిమాలో రణబీర్ కి తనకి మధ్యన ఇంట్రెస్టింగ్ గా ఎలాంటి సీన్స్ లేవని తెలిపారు.
రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. పార్ట్ 2 లో మా నడుమ ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయి. ఈ చిత్రంలో తమ ఇద్దరికీ రెండు రాజ్యాలు ఉంటాయని అలా అప్పుడే ఇద్దరి మధ్య సీన్స్ ఇంకా రాలేదు. కానీ రణబీర్ నేను రామాయణ సెట్ లో కలిస్తే చాలా గొప్పగా ఉంటుంది అంటూ యష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





కృతి హోప్స్ అన్ని ఆ డైరెక్టర్ పైనే 
Loading..