కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కి హిట్ వచ్చి కొన్నేళ్ళవుతుంది. వరసగా సినిమాలు చేస్తున్నా అందులో కొన్ని తమిళ్ లో వర్కవుట్ అయినా తెలుగులో మాత్రం ప్లాపులుగానే మిలిగిపోయాయి. అయితే అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం తరువాత ఆయన ఇప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చెయ్యలేదు.
ఎక్కువగా రేసింగ్ కోసం దుబాయ్ ఇలా తిరుగుతున్నారు తప్ప కొత్త ప్రాజెక్ట్ విషయంలో అజిత్ యాక్టీవ్ గా ఉండడకపోవడానికి కారణం ఆయన్ని చూసి నిర్మాతలు పారిపోతున్నారట. అజిత్ తన పారితోషికాన్ని రూ.180 కోట్లు పెంచేసి ప్రొడ్యూసర్స్ ని డిమాండ్ చేయడంతోనే ఆయనతో సినిమా అనుకున్న టాలీవుడ్ నిర్మాతలు సైలెంట్ గా తప్పుకున్నారనే మాట కోలీవుడ్ సర్కిల్స్ లో హైలెట్ అవుతోంది.
అందుకే అజిత్ తానే నిర్మాతగా మారి సినిమా చేసే ఆలోచనలో ఉన్నారనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తుంది. మరి అజిత్ నెక్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో అనేది ప్రస్తుతం సస్పెన్స్ అని చెప్పాలి.




ఈసారి స్నేహితులను నమ్ముకోని మారుతి 

Loading..