ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆంధ్రలో వినూత్న ఐడియా ని ఆచరణ లో పెడుతున్నారు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించే విషయం. తమ పార్టీ నేతలను నారా లోకేష్ ఇంటికి పిలిచి గౌరవించే సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు టీడీపీ నేతలను ఇంటికి పిలిచి డిన్నర్ ఇచ్చి మాటామంతి అంటూ ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్ కార్యక్రమం మొదలు పెట్టారు.
మొదటిరోజు బందరు లోక్ సభ సెగ్మెంట్ నేతల ఫ్యామిలీతో లోకేష్ డిన్నర్ ఏర్పాటు చెయ్యడంతో ఈ కార్యక్రమం కుటుంబ శుభకార్యం జరిగినట్లుగా చెబుతున్నారు. ఇకపై ప్రతిరోజూ ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్ ప్రోగ్రాం ని చేపట్టేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నారట. ఇలా అయితే లోకేష్ ప్రతి నేతతో నేరుగా ఇంటరాక్ట్ అవుతూ అన్ని విషయాలు మాట్లాడతారు. ఇలాంటి కార్యక్రమం వల్ల టీడీపీ నేతలు తమ సాధకబాధలు లోకేష్ కి వివరించవచ్చు.
ప్రతి నియోజక వర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, ఆ నియోజకవర్గ సమస్యలు అన్ని ఈ ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్ కార్యక్రమంలో లోకేష్ కి చేరతాయి. అది చూసే లోకేష్ ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్ ఐడియా అదుర్స్ అంటూ టీడీపీ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.





1400 కోట్లు ఈ టాలీవుడ్ సినిమా బడ్జెట్
Loading..