పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో AA 22 ప్రాజెక్ట్ చేస్తున్నారు. AA 22 ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ తోనే హాలీవుడ్ రేంజ్ చూపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న AA 22 2027 లో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే కి AA 22 గ్లింప్స్ వదిలేందుకు అట్లీ ప్లాన్ చేస్తున్నారు.
ఇక రీసెంట్ గానే కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో అల్లు అర్జున్ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ తో చెయ్యబోయే మూవీ ప్రీ ప్రొడక్షన్ పనిలో పడ్డారు. అందులో భాగంగా అల్లు అర్జున్ తో చెయ్యబోయే AA 23 ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట.
ప్రభాస్ తో సాహో లో నటించిన శ్రద్ద కపూర్ అయితే అల్లు అర్జున్ పక్కన బావుంటుంది అనుకుంటున్నారట. మరి పాన్ ఇండియా మూవీస్ అంటే ఖచ్చితంగా బాలీవుడ్ హీరోయిన్స్ కావాల్సిందే. ఇప్పటికే అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొనె, జాన్వీ కపూర్ లు నటిస్తున్నారు. ఇప్పడూ లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ కోసం శ్రద్ద కపూర్ ని తీసుకొస్తున్నాడన్నమాట.




అప్పుడు అభిజిత్ - ఇప్పుడు తనూజ 
Loading..