ఈ ఏడాది రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాల్తో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది. ఇలా కొద్దిమంది హీరోయిన్స్ కి మాత్రమే అరుదుగా జరిగే అదృష్టం. ఒకప్పుడు పూజ హెగ్డే ఇలానే క్రేజీగా కనిపించింది. ఆతర్వాత శ్రీలీల టైమ్ నడిచింది. ఆ నెక్స్ట్ మీనాక్షి చౌదరి ఇంత బిజీగా కనిపించింది. ఇప్పుడు ఆ అదృష్టం భాగ్యశ్రీ బోర్సే కి దక్కింది.
మిస్టర్ బచ్చన్ డిజాస్టర్, కింగ్ డమ్ ఫెయిల్. అయినా ఈభామకు ఫుల్ డిమాండ్. ఈ ఏడాది అది కూడా ఒకే నెలలో భాగ్యశ్రీ బోర్సే రెండు సినిమాలతో అలరించేందుకు సిద్ధమైంది. అందులో ఒకటి కాంత. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 14 న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే క్యూట్ గా వింటేజ్ లుక్ లో కనిపిస్తుంది.
ఇదే నెలలో హీరో రామ్ తో కలిసి నటించిన ఆంధ్ర తాలూకా కింగ్ చిత్రం విడుదలవుతుంది. నవంబర్ 28 న ఆంధ్ర తాలూకా కింగ్ చిత్రం విడుదలవుతుంది. ఈ చిత్రం పై కూడా మంచి అంచనాలున్నాయి. ఈ రెండు చిత్రాలతో నవంబర్ అదృష్టం పరిక్షించుకోబోతున్న భాగ్యశ్రీ బోర్సే కి సక్సెస్ దక్కాలని కోరుకుందాం.




ఊపిరితిత్తుల ఆరోగ్యానికి 10 చిట్కాలు

Loading..