గద్దర్ ఫిలిం అవార్డ్స్ ను తెలంగాణ ప్రభుత్వం జూన్ 14 శనివారం సాయంత్రం హైదరాబాద్ హైటెక్స్ లో ఎంత గ్రాండ్ గా నిర్వహించిందో ప్రతి ఒక్కరూ చూసారు. బాలకృష్ణ, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు స్వయంగా వచ్చి తమ తమ అవార్డులను అందుకున్నారు. FDA చైర్మన్ గా టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే ఈ అవార్డు వేడుకలో చాలామంది స్టార్స్ అంటే అవార్డు లు వచ్చిన చాలామంది సినీ స్టార్స్ కనిపించలేదు.
ఆ విషయంలో దిల్ రాజు వారికి వార్నింగ్ ఇవ్వడానికో లేదంటే రిక్వెస్ట్ చేయడానికో పర్సనల్ గా ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడిన మాటలు సెలెబ్రిటీసుకి వార్నింగ్ లా అనిపించాయి అని కొందరు, కాదు ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారని మరికొందరూ మట్లాడుకునేలా ఉన్నాయి.
ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి అంటే ఏ స్టేట్ అయినా సరే మీరే వచ్చి తీసుకోవాలి.. ఇప్పుడు తెలంగాణలో జరిగింది. నెక్స్ట్ ఆంధ్ర లో కూడా అవార్డ్స్ ఇస్తారు, అందరికీ చెబుతున్నా.. గుర్తు పెట్టుకోండి, అవార్డు వచ్చినవాళ్ళు మీరే వచ్చి వేదికపై ఆ అవార్డు ను స్వీకరించాలి, షూటింగ్స్ లో బిజీ గా ఉన్నా అందరూ ఖచ్చితంగా హాజరు కావాలి.
ప్రభుత్వంతో కలిసి జర్నీ చెయ్యాల్సిన బాధ్యత అందరిది, తేదీని, ఈవెంట్ ఎక్కడ జరుగుటుందో అనేది డైరీలో డేట్ నోట్ చేసుకోవాలి, అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా అంటూ కాస్త సీరియస్ టోన్ తోనే టాలీవుడ్ ప్రముఖుల గురించి మాట్లాడారు.