బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనె కల్కి చిత్రంతో సౌత్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె కల్కి 2 లో నటించాల్సి ఉంది. ఈలోపే సందీప్ వంగ దీపిక పదుకొనె కి స్పిరిట్ లో అవకాశం ఇవ్వడం ఆమె వర్కింగ్ స్టయిల్ నచ్చక ఆమెను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. ఆతర్వాత దీపిక పీఆర్ టీమ్ స్పిరిట్ స్టోరీ లైన్ ని బయటపెట్టింది.. డర్టీ పిఆర్ గేమ్ అంటూ సందీప్ వంగ దీపిక పై ఫైర్ అయ్యారు.
దీపిక పదుకొనె మాత్రం ఈమధ్యన ఓ దర్శకుడు కథ చెప్పారు, కథ నచ్చింది.. నేను అడిగిన పారితోషికం వాళ్ళు ఇవ్వలేకమన్నారు, నా స్ట్రాటజీ నాకు ఉంటుంది, అందుకే నేను ఆ ప్రోజెక్టు(స్పిరిట్) చెయ్యనన్నాను అంది. ఈలోపు దీపిక పదుకొనె కి అల్లు అర్జున్-అట్లీ AA 22 లో ఛాన్స్ వచ్చింది అనే ప్రచారం జరిగింది.
అది చూసిన వారు స్పిరిట్ కి ఇవ్వలేమన్న పారితోషికం AA 22 కి దీపికకు ఆ సినిమా నిర్మాతలు ఇస్తున్నారా, అందుకే దీపిక AA 22 లో నటించేందుకు రెడీ అవుతుంది, ఆమె అడిగింది వీళ్ళు ఇస్తున్నారా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇవ్వబట్టే కదా సౌత్ హీరో సినిమాకి దీపిక ఓకె చెప్పింది అంటూ ఆమె అభిమానులు దీపిక కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు.