హిందీలో సైఫ్- దీపిక లాంటి పెద్ద స్టార్లు నటించిన కాక్ టైల్ లో డయానా నటనకు మంచి పేరొచ్చింది. ఇక ఈ భామ ఇటీవల ఓటీటీ రంగంలోను వరస అవకాశాలు అందుకుంటోంది. పెద్ద తెర వర్సెస్ ఓటీటీ తెర ఏది బెస్ట్? అంటే దానికి డయానా ఇచ్చిన సమాధానం ఇదీ...
ప్రస్తుతం ఓటీటీ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న డయానా, ఈ మాధ్యమంలో పనిచేయడం సినిమాల కంటే భిన్నంగా ఉందని అన్నారు. దీర్ఘకాలిక ఓటీటీ ప్రాజెక్ట్లోకి ప్రవేశించడం అనేది సినిమా కంటే చాలా డిమాండ్తో కూడుకున్నది. మరింత బాగా లీనమయ్యేది ఓటీటీ రంగం. ఎందుకంటే దీనికి ఎక్కువ పని గంటలు అవసరం. నటి లేదా నటుడికి పాత్రతో ఉండటానికి ఎక్కువ సమయం లభిస్తుంది. అందువల్ల ఎక్కువ సృజనాత్మక సంతృప్తి లభిస్తుంది. పాత్ర, కథలోకి లోతుగా వెళ్ళవచ్చు.. అని తెలిపారు.
ఓటీటీలతో ప్రయోజనాలను మరింత లోతుగా వివరించిన డయానా నటీనటులు ఈ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నారు. ఓటీటీ మాధ్యమం ప్రయోగాలు చేయడానికి, మెరుగుపరచడానికి ఎక్కువ స్థలాన్ని ఇస్తుంది. ఇది నటులుగా సుసంపన్నం చేస్తుంది.. అని తెలిపింది. డయానా ఇటీవల భారీ బ్లాక్ బస్టర్ చావాలో ఒక ముఖ్య పాత్రను పోషించింది. తదుపరి సెక్షన్ 84 సిరీస్ తో అభిమానుల ముందుకు రానుంది. డేరింగ్ పార్టనర్స్ అనే బుల్లితెర సిరీస్ లోను డయానా పెంటీ నటిస్తోంది.