యంగ్ హీరోస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కాంబోలో నాంది ఫేమ్ విజయ్ కనకమేడల తెరకెక్కించిన భైరవం చిత్రం నేడు మే 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భైరవం చిత్ర పోస్టర్స్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు, అలాగే ముగ్గురు హీరోలు, హీరోయిన్ అదితి శంకర్ తో కలిసి చేసిన ప్రమోషన్స్ హడావిడి అన్ని సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది.
ఇప్పటికే భైరవం ఓవర్సీస్ షోస్ పూర్తి కావడంతో ఆడియన్స్ హంగామా చేస్తూ సోషల్ మీడియాలో భైరవం చిత్ర విశేషాలను పంచుకుంటున్నారు. భైరవం ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. లుక్స్ విషయంలో ముగ్గురు హీరోలు పోటీ పడ్డారు, బెల్లంకొండ శ్రీనివాస్ రగ్గడ్ రస్టిక్ లుక్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగతా హీరోలు మంచు మనోజ , నారా రోహిత్ కూడా ఫెరోషియస్ అండ్ డైనమిక్ రోల్స్ లో అద్దరగొట్టారు.
అయితే భైరవం చిత్రం రీమేక్ కావడంతో పాత వాసనతో కూడిన కథ అవ్వడం వల్ల రొటీన్ సినిమాలా అనిపిస్తుంది. ఫస్టాఫ్ కొంత రెగ్యులర్ ఉందనే ఫీలింగ్ కలిగింది. కానీ ఇంటర్వెల్ సీన్తో కొంత పుంజుకొన్నది. సెకండాఫ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్.. అంటూ ఓ ఆడియెన్ ట్వీట్ చేసాడు.
భైరవంలో ముగ్గురు హీరోలు నటనలో పోటీ పడ్డారు. నాకైతే ఫస్ట్ హాఫ్ సో సో గా ఉంది, సినిమా మొదటి ఇరువై నిమిషాలు రొటీన్ కథ. ఈ సినిమాలో హీరోల క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డ్రామా ఎంగేజింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో డ్రామా బాగా పండింది.. అంటూ మరో ఆడియెన్ కామెంట్ చేసాడు.
భైరవం సినిమా సోకాల్డ్ రస్టిక్ యాక్షన్ డ్రామా. ఫస్టాఫ్ అంతంత మాత్రంగానే ఉంది. కథ వేగానికి లవ్ ట్రాక్, పాటలు అడ్డుకట్ట వేశాయి. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువయ్యాయి. అర్ధం పర్ధం లేని ఫైట్లు, ఎలివేషన్ కథలోని ఫ్లేవర్ను దెబ్బతీశాయంటూ మరో ఆడియెన్ స్పందించాడు. మరి భైరవం అసలు కథ, అసలు రిపోర్ట్ ఏమిటి అనేది రివ్యూలో చూద్దాం.