మెగాస్టార్ ఆశీస్సులు అందుకున్న మహానటి

‘మహానటి’ చిత్రంలో సావిత్రిగా అద్భుత నటనతో మైమరిపించిన కీర్తి సురేష్ ‘జాతీయ ఉత్తమ నటి’గా పురస్కారం దక్కించుకున్న సంగతి తెలిసిందే. కీర్తిపై పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కతర్ రాజధాని దోహలో జరిగిన ‘సైమా అవార్డుల’ వేడుకలో ముఖ్య అతిధి మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో సావిత్రిని తలపించేలా సాంప్రదాయ చీరకట్టులో కీర్తి దర్శనమిచ్చారు. కీర్తి మెగాస్టార్ వద్దకు చేరుకుని ఎంతో వినమ్రంగా నవ్వులు చిందిస్తూ ముచ్చట్లాడారు. మెగాస్టార్ సైతం చిరునవ్వులు చిందిస్తూ తనకు ఆశీస్సులు అందిస్తున్న ఆ దృశ్యం కన్నులపండువగా కనిపిస్తోంది.
keerthi suresh takes blessings from megastar chiranjeevi
keerthi suresh takes blessings from megastar chiranjeevikeerthi suresh
blessings
megastar chiranjeevi
siima awards








































