ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rathnavelu Realizes it from Charan Film

చరణ్‌ సినిమాతో రత్నవేలుకి తెలిసొచ్చింది!

మెగా హీరో రామ్‌చరణ్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా గోదావరి జిల్లాలలో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి కెమెరామెన్‌ రత్నవేలు. సుమారు 20 రోజులు నుండి ఏకథాటిగా జరుగుతున్న ఈ షెడ్యూల్‌ అనంతరం అనేక విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ షెడ్యూల్‌లో షూట్‌ చేసిన ఓ సాంగ్‌ అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్‌ ద్వారా తెలుస్తుంది. 

అయితే ఈ షెడ్యూల్‌ జరుగుతున్న ప్రాంతం సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ లేని ఏరియా అంట. ఈ షూటింగ్‌లో పాల్గొన్న అందరి దగ్గర 20 రోజుల పాటు సెల్‌ఫోన్స్‌ మూగబోయాయి. అస్సలు ఈ షూట్‌లో వాళ్ళ దగ్గర సెల్‌ఫోన్‌ ఉందనే విషయమే అందరూ మరిచిపోయారంట. 20 రోజుల తర్వాత కెమెరామెన్‌ రత్నవేలుకి సెల్‌ఫోన్‌ గుర్తుకువచ్చిందట. 

దీనిపై రత్నవేలు తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ట్విట్‌ కూడా చేశాడు. ఎంతో విలువైన మనిషి జీవితాన్ని సెల్‌ఫోన్‌ హరించేస్తుందని, ఈ 20 రోజులు ఎంతో హాయిగా గడిచాయని..రత్నవేలు తెలిపాడు! 

'20 days without mobile network filming in Godavari dist was a nightmare !Coming back to city realised the mobile detox was good though'.. Rathnavelu Twitted

Rathnavelu Realizes it from Charan Film
rathnavelu isc
raghnavelu dop
ram charan and sukumar film godavari districts
cell phone