Advertisement

గుణశేఖర్‌ది పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమే!

Mon 10th Aug 2015 08:19 AM
rudhramadevi,gunasekhar,mahesh babu,prathaparudhrudu  గుణశేఖర్‌ది పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమే!
గుణశేఖర్‌ది పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమే!
Advertisement

ఎప్పుడెప్పుడా అని టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న 'బాహుబలి'; మహేష్‌బాబు 'శ్రీమంతుడు' మంచి విజయాలను సాధిస్తున్నాయి. దీంతో అందరి చూపు ఇప్పుడు గుణశేఖర్‌ 'రుద్రమదేవి'పై పడింది. దాదాపు 70కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాలకు, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు మాత్రమే పరిమితమైన చారిత్రక కథాంశం. అయితే భారీ సాంకేతిక పరిజ్ఞానం.. మరీ ముఖ్యంగా 3డీ సినిమా కావడంతో కొందరు మాత్రం ఈ చిత్రాన్ని చూడాలని ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 4న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టోరీ అయినప్పటికీ గుణశేఖర్‌ మాత్రం దీనిని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్‌ చేయాలని భావిస్తున్నాడు. ఈ చిత్రంపై ఎక్కువశాతం మంది పెద్దగా ఆసక్తిచూపకపోవడంతో ఆయన త్వరలో తాను మహేష్‌బాబుతో 'ప్రతాపరుద్రుడు' చేస్తానంటున్నాడు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమే అని, మహేష్‌ పేరు చెప్పి ప్రస్తుతానికి 'రుద్రమదేవి'ని గట్టెక్కించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలాంటి విషయాలను లీక్‌ చేస్తున్నాడని, మహేష్‌ సినిమా అంటే మరో రెండేళ్లు వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. మొదట 'బ్రహ్మూెత్సవం' చేయాలి. తర్వాత త్రివిక్రమ్‌ సినిమా, ఆ తర్వాత పూరీజగన్నాథ్‌, ఆ వెంటనే మురుగదాస్‌, రాజమౌళి, వినాయక్‌ వంటి పలువురు వెయిటింగ్‌లో ఉండటం చూస్తే గుణశేఖర్‌ది కేవలం పబ్లిసిటీ గిమ్మికే అని చెప్పవచ్చు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement