కాజల్‌కు మరో ఆఫర్‌!

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలందరి సరసన నటించిన కాజల్‌ అగర్వాల్‌కు తమిళంలో మాత్రం చెప్పుకొనే ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆమె వరుస తమిళ చిత్రాలతో దూసుకెళుతోంది. కాజల్‌ హీరోయిన్‌గా ప్రస్తుతం తమిళంలో మూడు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి ధనుష్‌తోకాగా, మరొకటి విశాల్‌తో రూపొందనుంది. కాగా ఇప్పుడు ఆమెకు తాజాగా విక్రమ్‌ సరసన నటించే అవకాశం వచ్చింది. మురుగదాస్‌ శిష్యుడు ఆనంద్‌శంకర్‌ దర్శకత్వంలో ‘మర్మ మణితన్‌’ (ఎవ్వరికీ అర్థం కాని వ్యక్తి) అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో విక్రమ్‌ ద్విపాత్రాభినయం చేస్తుండగా, కలైపులి థాను నిర్మిస్తున్నాడు. 

tallywood
kajal
thamil movies
vikram new movie
marma manithan