Advertisement

1940ల నాటి కథలో మెగాహీరో..!

Mon 23rd Feb 2015 04:58 AM
mukunda,varun tej,krish,1940 story,usha kiran movies  1940ల నాటి కథలో మెగాహీరో..!
1940ల నాటి కథలో మెగాహీరో..!
Advertisement

‘ముకుంద’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ త్వరలో అభిరుచి గల దర్శకుడు క్రిష్‌తో కలిసి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.తన చిత్రాలకు ఎప్పుడూ ఏదో ఒక వైవిధ్యమైన కథను ఎంచుకునే క్రిష్‌ ఈ చిత్రానికి కూడా విభిన్నమైన ఇతివృత్తాన్ని ఎంచుకున్నాడని సమాచారం.ఈ చిత్రం స్వాతంత్య్రం రాకమునుపు అంటే 1940లలో జరిగే ఓ కథ అని తెలుస్తోంది. 1940ల నాటి ఓ రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. కాగా ఈ చిత్ర నిర్మాణంలో కూడా క్రిష్‌ భాగస్వామిగా ఉంటాడట. అన్నట్లు ఆయన తాజాగా తమిళ ‘శైవం’ చిత్రాన్ని ఉషాకిరణ్‌ మూవీస్‌ బేనర్‌తో కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘దాగుడు మూతల దండాకోర్‌’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సీక్వెల్‌ తీసే ఉద్దేశ్యంలో కూడా క్రిష్‌ ఉన్నాడని సమాచారం.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement