Advertisement

గవర్నర్‌ టెలిఫోన్‌ను హ్యాక్‌ చేశారా..??

Wed 21st Jan 2015 08:21 AM
governer telephone hacked,rajbhavan telephone hacked,ap governer narasimhan,telangana governer narasimhan,narasimhan with chandrababu naidu and kcr  గవర్నర్‌ టెలిఫోన్‌ను హ్యాక్‌ చేశారా..??
గవర్నర్‌ టెలిఫోన్‌ను హ్యాక్‌ చేశారా..??
Advertisement

రెండు రాష్ట్రాలకు ప్రథమ పౌరుడిగా ఉన్న గవర్నర్‌ నరసింహన్‌ నివసిస్తున్న రాజ్‌భవన్‌లో టెలిఫోన్‌ వ్యవస్థ హ్యాక్‌ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా రాజ్‌భవన్‌లోని టెలిఫోన్‌కు రూ. 5 లక్షల బిల్లు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాజ్‌భవన్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌లోకి చొరబడిన దుండగులు అక్రమంగా విదేశాలకు భారీ ఎత్తున ఫోన్లు చేశారని, అందుకే ఒక నెలకే దాదాపు రూ. 5 లక్షల బిల్లు వచ్చిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ఈ విషయమై అధికారులు కొంత విచారణ జరపగా ఈ టెలిఫోన్‌ నుంచి అధికంగా విదేశాలకే కాల్స్‌ వెళ్లినట్లు తెలిసింది. ముఖ్యంగా ఒమన్‌, శ్రీలంక దేశాలకు ఈ టెలిఫోన్‌నుంచి కాల్స్‌ వెళ్లినట్లు గుర్తించిన అధికారులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ టెలిఫోన్‌ హ్యకింగ్‌కు సంబంధించి సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. హైదరాబాద్‌ సిటీ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఈ టెలిఫోన్‌ హ్యాకింగ్‌ కేసుపై ఇప్పటికే సమీక్ష సమావేశం కూడా జరిపినట్లు తెలిసింది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement