యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి రోకా వేడుక గత నెలలో అంగరంగ వైభవవంగా జరిగింది. సంప్రదాయం, వేడుక, కుటుంబ ఆత్మీయతల కలయికతో జరిగిన ఈ వేడుక, వారి వివాహ ప్రయాణానికి ఒక పరిపూర్ణమైన ఆరంభాన్ని ఇచ్చింది.
వివాహానికి ముందు జరిగే వేడుకలు అధికారికంగా ప్రారంభం కాగా, నిశ్చితార్థం ఏప్రిల్ 5న జరగనుంది. విశాలమైన ఫామ్హౌస్లో జరగనున్న ఈ కార్యక్రమం వైభవం, ఆత్మీయతల కలయికగా ఉంటుంది. ఈ వేడుకలో సినీ పరిశ్రమ మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు.
వీరి వివాహ వేడుక ఏప్రిల్ 29న, దివ్యమైన తిరుమల ప్రాంగణంలో జరగనుంది. అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం చిరస్మరణీయమైన కలయికకు సరైన వేదికగా నిలుస్తుంది.





డీ-ఏజింగ్ టెక్నాలజీతో యంగ్ లుక్స్!

Loading..