మోడ్రన్ ప్రపంచం సాంకేతికంగా ఎంత ఎదిగినా ఇంకా శాస్త్రాల్ని నమ్ముతోంది. ముఖ్యంగా సనాతన భారతీయ సాంప్రదాయం, శాస్త్రాలపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోందే కానీ తరగడం లేదు. లార్డ్ కృష్ణ భగవద్గీత- కర్మ సిద్ధాంతాన్ని, బంగ్లాదేశీ భవిష్యవాణి బాబా వంగా చెప్పే విషయాలను, చివరికి జ్యోతిష్యాన్ని కూడా నమ్ముతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్భ్రాంతికర ఘటనలు సహా భారతదేశంలో జరిగిన కొన్ని ఘటనలు సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరినీ భయపెడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి! అనే స్పృహను కూడా పెంచుతున్నాయి. గుజరాత్ అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం భవంతిపై కూలిన ఘటనలో 250 మంది పైగా మరణించడం కలచి వేసిన సంగతి తెలిసిందే. విమానంలో ప్రయాణీకులు, భవంతిలో విద్యార్థులు కూడా చనిపోయారు. ఒకే ఒక్క మృత్యుంజయుడు తనకు ఇంకా భూమిపై నూకలు మిగిలే ఉన్నాయని నిరూపించాడు.
ఇది ఒక్కటే కాదు.. ఇటీవల ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఫైట్ సహా చాలా షాకింగ్ ఘటనలు ప్రముఖ కథానాయికకు ఊపిరాడనివ్వని విషయం బయటపడింది. తాను భయపడటమే గాక అందరినీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఒక ప్రముఖ సినీ సెలబ్రిటీ ఆట స్థలంలో ఆట ఆడుతుండగా, అతడి గొంతులోకి తేనెటీగ దూరించింది. అది గట్టిగా కరిచింది. దీంతో శ్వాస నాళం మూసుకుపోయి ఊపిరాడలేదు. ఇంతలోనే కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందాడు! అంటూ వరుస ఘటనల క్రమాన్ని వివరించిన సదరు పాపులర్ హీరోయిన్ జరుగుతున్న ఘటనలు చాలా వ్యక్తిగతమైనవి.. ప్రమాదకరమైనవి అని సూచించింది. ఈ ఏడాది అసలేం బాలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అందరినీ ముందే హెచ్చరించింది. ఏమో చెప్పలేం.. ఎప్పుడు ఎట్నుంచి ఏ ముప్పు పొంచి ఉందో ఊహించలేం! గీతా పారాయణం వల్లిస్తూ... అన్నదానం, సేవాభావంతో పుణ్య కార్యాలు చేపడుతూ కొంతైనా కర్మను తగ్గించుకోవడం మానవుని విధి!!