ఏమాయ చేసావె... కాంబినేషన్లో ఓ  చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో సమంత ఒక్కటీ లేదు  కానీ... మిగతా అంతా సేమ్ టు సేమ్. అయితే సమంత ప్లేస్లో ఈసారి మలయాళం  నుంచి మంజిమ మోహన్ అనే ముద్దుగమ్మని తీసుకొచ్చాడు గౌతమ్మీనన్. చైతూ ఈ  సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. మళ్లీ `ఏమాయ చేసావె` తరహా మేజిక్  రిపీట్ అవుతుందని ఆయన ఆశపడుతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా  చిత్రీకరణ జరుగుతోంది. నాగచైతన్యనీ, మంజిమ మహేష్నీ ఓ బుల్లెట్పై  ఎక్కించి హైవేకి తీసుకొచ్చాడు దర్శకుడు గౌతమ్మీనన్. ఆ సన్నివేశాల  చిత్రీకరణకి  సంబంధించి కొన్ని స్టిల్స్ బయటికొచ్చాయి. అందులో ఇదొకటి.  చూస్తుంటే చైతూ, మంజిమ జంట ముద్దొచ్చేలా ఉంది కదూ!  అన్నట్టు ఇదే  చిత్రాన్ని తమిళంలో శింబుతో తెరకెక్కిస్తున్నారు గౌతమ్మీనన్. శింబు  సినిమాకి సంబంధించి కూడా ఇలాంటి స్టిల్లే బయటికొచ్చింది. `ఏమాయ చేసావె`ని  కూడా తెలుగులో నాగచైతన్య, తమిళంలో శింబు చేశాడు. 
                      



                     
                      
                      
                     
                    
 Loading..