Advertisement

గోదారిలో వరుణ్ తేజ్ జాతర!

Thu 02nd Apr 2015 06:18 AM
varun tej,godavari,krishna,jathara,kanche  గోదారిలో వరుణ్ తేజ్ జాతర!
గోదారిలో వరుణ్ తేజ్ జాతర!
Advertisement

క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'కంచె' చిత్రం షూటింగ్ పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలో జరుగుతుంది. 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. బుధవారం నాడు హీరో హీరోయిన్లపై పల్లెటూరి వాతావరణం నేపధ్యంలో ఓ జాతర పాటను, కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. వరుణ్ తేజ్ సరసన ఈ చిత్రంలో 'మిర్చి లాంటి కుర్రాడు' ఫేం ప్రజ్ఞ జైశ్వాల్ కథానాయికగా నటిస్తుంది. వరుణ్ తేజ్ తొలి చిత్రం 'ముకుంద' షూటింగ్ ఎక్కువ భాగం గోదావరి జిల్లాలోనే జరిగింది.  

చారిత్రాత్మక నేపధ్యంలో స్వాతంత్ర్య సమరయోధుల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజీవ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement