Advertisement

మిర్చి నిర్మాతల చేతికి 'బాహుబలి'..!

Wed 21st Jan 2015 11:15 PM
uv creations to takeover baahubali,uv creation distribution for baahubali,bahubali,prabhas,anushka,  మిర్చి నిర్మాతల చేతికి 'బాహుబలి'..!
మిర్చి నిర్మాతల చేతికి 'బాహుబలి'..!
Advertisement

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మిత్రులు బాహుబలి సినిమా తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నారు. మిర్చి నిర్మాణ సంస్థ అధినేతలు ప్రమోద్, వంశిలు.. బాహుబలి సినిమాను తమిళనాడులో స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి విడుదల చేయనున్నారు. ఈ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఎక్కువ రేటు పెట్టి కొన్నట్టు సమాచారం. విడుదలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. ఇప్పటికే పలు ఏరియాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను నిర్మాతలు అమ్మేశారు అంటే బాహుబలిపై క్రేజ్ ఎంతలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చారిత్రాత్మక సినిమాలో రానా విలన్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. అనుష్క, తమన్నా హీరోయిన్‌లు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ ఈ భారి బడ్జెట్ సినిమాను నిర్మిస్తుంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement