Advertisementt

VIROSH జంట స్పెషల్ లంచ్

Tue 03rd Mar 2026 07:26 PM
virosh  VIROSH జంట స్పెషల్ లంచ్
VIROSH Couple Special Lunch VIROSH జంట స్పెషల్ లంచ్
Advertisement
Ads by CJ

పెళ్ళికి ముందు వరకు ఎలాంటి అనౌన్సమెంట్ లేకుండా అన్ని గుట్టుచప్పుడు కాకుండా చేసుకున్న VIROSH జంట విజయ్ దేవరకొండ-రష్మిక లు పెళ్లి విషయాన్ని ఒకేసారి అనౌన్స్ చేసారు. ఫిబ్రవరి 26 న రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో వివాహం, మార్చ్ 4 న హైదరాబాద్ లో రిసెప్షన్ అని.

మార్చ్ 4 న హైదరాబాద్ లో జరగబోయే వెడ్డింగ్ రిసెప్షన్ కి పీఎం మోడీ దగ్గరనుంచి హోమ్ మినిష్టర్ అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరకు విజయ్ దేవరకొండ-రష్మిక పర్సనల్ గా వెళ్లి వారిని ఆహ్వానించారు. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ-రష్మిక లు అల్లు శిరీష్ పెళ్లి కొడుకు ఫంక్షన్ కి హాజరవడం, తర్వాత విజయ్ స్వగ్రామం లో వ్రతం చెయ్యడం ఇవన్నీ చూసాం.

ఇక మీడియా నుంచి ఎప్పుడు తప్పించుకునే ఈ జంట మీడియా కోసం హైదరాబాద్ లో మార్చ్ 4 మధ్యాన్నం స్పెషల్ లంచ్ ఏర్పాటు చేసారు. హైదరాబాద్ లోని FNCC లో మీడియా కి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసారు. మీడియా మిత్రులను ఈ లంచ్ కి ఆహ్వానించి కొత్త జంట విజయ్-రష్మిక లు కాసేపు మీడియా వారితో ముచ్చటిస్తారని తెలుస్తుంది.

ఆ తర్వాత మార్చి 4 సాయంత్రం తాజ్ కృష్ణ లో VIROSH వెడ్డింగ్ రిసెప్షన్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

VIROSH Couple Special Lunch:

VIROSH Couple Special Lunch For Media

Tags:   VIROSH
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ