ప్రజాస్వామ్యానికి పట్టంకట్టిన సామాన్యుడు!

పాలకుల గుండెల్లో ప్రమాద ఘంటికలు!!

దిల్లీ , అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత ప్రజాతంత్ర వ్యవస్థని పటిష్టం చేసింది. ధనస్వామ్యాన్ని, మతం మత్తుని, పాలనా యంత్రాంగం పెత్తనాన్ని సామాన్యుడు కాలరాచాడు. ఓటు విలువని తెలియజెప్పాడు. కాంగ్రెసు ఖాతా తెరవకపోవడం, బిజెపి మూడు స్థానాలకే పరిమితం కావడం, ఆమ్‌ ఆద్మీ 70లో 67 సీట్లు సంపాదించడం రాజకీయ విశ్లేషకులను విస్మయపరిచింది. బిజెపి, పరాజయానికి కారణాలనుకాదు ఇప్పుడు చూడవలసింది : ‘కేజ్రీవాల్‌’ వలె నాయకుడు ఎంత నిరాడంబరంగా, నిస్వార్ధంగా, నిజాయితీగా వుండాలో గమనించాలి. వ్యక్తి ఆరాధనని నిరసించాలి. భారతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన దిల్లీ ఓటరు అభినందనీయుడు. ఆంధ్రాలో ‘లోక్‌సత్తా’, దేశంలో వామపక్షాలు సాధించలేనిది ‘కేజ్రీవాల్‌’ సాధించడం గమనార్హం.

-తోటకూర రఘు

kejriwal. bjp
assembly
delhi
loksattha