ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> False allegations regarding the Mega DSC

మెగా డీఎస్సీ పై బిగ్ కుట్ర

False allegations regarding the Mega DSCFalse allegations regarding the Mega DSC

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడిమూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత సైన్యంలో హవల్దార్‌గా సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన వి. చక్రపాణి రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షలో ఎక్స్-సర్వీస్‌మెన్ కోటా కింద మెరిట్ ప్రాతిపదికన ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన నడిమూరు పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఆయన తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తుండగా, 'బ్లూ' మీడియాకు చెందిన రిపోర్టర్ గణేష్ మరియు కెమెరామన్ శ్రీకాంత్ పాఠశాలలోకి ప్రవేశించారు.
అనుమతి లేకుండా తరగతి గదిలోకి చొరబడి, ఉద్యోగానికి సంబంధించిన సర్టిఫికెట్లు చూపించాలని చక్రపాణి రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. సర్టిఫికెట్లు చూపించకపోతే తప్పుడు వార్తలు రాసి కెరీర్ పాడుచేస్తామని బెదిరించడమే కాకుండా, చిన్న పిల్లల ముందే ఆయన చొక్కా కాలర్ పట్టుకుని భౌతిక దాడికి దిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
​డీఎస్సీపై ప్రతికూల ప్రచారం: పారదర్శకంగా జరిగిన మెగా డీఎస్సీ నియామకాల ప్రామాణికతను ప్రశ్నిస్తూ, లబ్ధిదారులను మానసిక ఆందోళనకు గురిచేయడమే లక్ష్యంగా ఈ చర్యకు పాల్పడ్డారని విమర్శలు వెల్లువెత్తాయి.
చట్టపరమైన చర్యలు & స్పందనలు ​పోలీస్ కేసు నమోదు: బాధితుడు వి. చక్రపాణి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కుప్పం పోలీసులు సాక్షి రిపోర్టర్ గణేష్, కెమెరామన్ శ్రీకాంత్‌లపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. 

విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడిపై, దేశ సరిహద్దుల్లో సేవ చేసిన మాజీ సైనికుడిపై తరగతి గదిలోనే దాడి చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు, మాజీ సైనిక సంక్షేమ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
​'బ్లూ' మీడియా కూడా మెగా డీఎస్సీపై ఆధారాలు లేకుండానే పదేపదే సందేహాలు వ్యక్తం చేస్తూ కొత్తగా నియమితులైన ఉపాధ్యాయుల్లో భయాందోళనలు సృష్టిస్తోందని ఆరోపించారు. నిజంగా అక్రమాలకు ఆధారాలు ఉంటే కోర్టులు లేదా రాజ్యాంగబద్ధ సంస్థల ముందు ఉంచాలని, మీడియా ప్రచారంతో గందరగోళం సృష్టించడం సరైన పద్ధతి కాదని అన్నారు. మరోవైపు, ప్రస్తుత ప్రభుత్వం ఇంకా మూడు డీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధమవుతోందని గుర్తు చేసిన అధికార కూటమి, గతంలో ఉద్యోగాలివ్వని వారు ఇప్పుడు ఉద్యోగాలపై రాజకీయాలు చేయడం ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించింది. 
ఇది చాలక ఈరోజు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా తో అన్ని అబద్దలను వల్లిస్తూ ఏపీలో డీఎస్సీ నిర్వహణ తీవ్ర కుంభకోణంగా మారిందని, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. 
ప్రభుత్వ స్పందన: మెరిట్ ద్వారా ఉద్యోగం పొందిన సామాన్యులను వేధించడం చట్టరీత్యా నేరమని, ఉపాధ్యాయుల భద్రతకు మరియు ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. 
 

False allegations regarding the Mega DSC