Advertisement

జగన్ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ - జనసేన కార్యకర్తలు

Wed 27th Mar 2024 02:17 PM
ycp  జగన్ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ - జనసేన కార్యకర్తలు
YSRCP జగన్ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ - జనసేన కార్యకర్తలు
Advertisement

 ఏపీ వ్యాప్తంగా చాలాచోట్ల టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. గత రెండు రోజులుగా వైసీపీ లోకి టీడీపీ, జనసేన నుంచి భారీగా చేరికలు కనిపిస్తున్నాయి. వైసీపీ లోకి టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరుతున్నారు. సీఎం జగన్ సమక్షంలో పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన కార్యకర్తలు వైస్సార్సీపీ పార్టీలోకి చేరడం హాట్ టాపిక్ అయ్యింది. 

ఏలూరు పార్లమెంట్‌ లో @JaiTDP భూస్థాపితం..

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ ఇంఛార్జ్‌ గోరుముచ్చు గోపాల్‌ యాదవ్‌.

పాయకరావుపేట నియోజకవర్గంలో ముగిసిన @JaiTDP, @JanaSenaParty క‌థ..

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి (పాయకరావుపేట).

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జైభారత్‌ నేషనల్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, పెద్దాపురం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దవులూరి దొరబాబు.

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా, ఏలూరు పార్లమెంట్‌ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్ధి కారుమూరి సునీల్, వైఎస్‌ఆర్‌సీపీ మైలవరం నేత జ్యేష్ట శ్రీనాథ్‌.. తదితరులు ఉన్నారు.

 

YSRCP:

YCP

Tags:   YCP
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement