ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> AP BJP President Purandeswari Comments.

పురందేశ్వరి ఆరోపణల్లో ఏది నిజం !

AP BJP President Purandeswari Comments.AP BJP President Purandeswari Comments.

పురందేశ్వరి ఆరోపణ : 

రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు : 97,000 కోట్లు 

2019 మార్చ్ 31 నాటికి, చంద్రబాబు దిగిపోయేనాటికి ఏపీ మీద ఉన్న అప్పు :  3,62,375 కోట్లు 

అంటే ఐదేళ్ళలో చంద్రబాబు చేసిన అప్పు : 2,65, 365 కోట్లు 

ఆ తరువాత వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగా  18 జులై 2023 నాటికీ ఏపీ అప్పు : 10,77,006 కోట్లు 

అంటే వైసిపి చేసిన అప్పు : 7,14,631 కోట్లు 

వాస్తవాలు : 

రాష్ట్ర విభజననాటికి ఉన్న అప్పు : 1,32,079 కోట్లు 

టిడిపి దిగిపోయేనాటికి రాష్టం అప్పులు : 3,,31,054 కోట్లు (వార్షిక పెరుగుదల 20. 17 శాతం )

2023 మార్చ్ నాటికి ఏపీ అప్పులు : 5,87,317 కోట్లు ( 16. 13 శాతం )

రాష్ట్ర విభజననాటికి ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు : 1,53, 346 కోట్లు 

టిడిపి దిగిపోయేనాటికి ఉన్న అప్పులు : 4,12,288 కోట్లు ( వార్షిక పెరుగుదల  21.  87 శాతం) 

2023 మార్చి నాటికి  అప్పులు : 6,51,789 కోట్లు 

టీడీపీ పాలనతో పోలిస్తే సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువే అని కాగ్ చెబుతోంది. అదే సమయంలో మూలధన వ్యయం చాలా ఎక్కువ అని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోంది. చంద్రబాబు హయాంలో ఐదేళ్ళలో రూ. 76,139 కోట్లు ఖర్చు చేశారు.. అంటే సరాసరి ఏడాదికి రూ.15,225 కోట్లు కాగా సీఎం వైయస్ జగన్ వచ్చాక నాలుగేళ్లలోనే రూ.75,411 కోట్లు ఖర్చు చేశారు. అంటే సరాసరి ఏడాదికి రూ.18,852 కోట్లు .. సామాజిక ఆస్తుల పెంపునకు ఖర్చు చేసినట్లు లెక్క . 

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాలేదు : పురంధేశ్వరి 

వాస్తవానికి టిడిపి జమానాలో రోడ్లకు పెట్టిన ఖర్చు :  రూ.3,160 కోట్లు 

సీఎం వైయస్ జగన్ వచ్చాక నాలుగేళ్లలో రోడ్లకు పెట్టిన ఖర్చు : రూ.4,493 కోట్లు 

ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం లేదు :  పురంధేశ్వరి 

వాస్తవాలు : బిజెపి పాలనలోని మధ్యప్రదేశ్ జీతాల బిల్లు : రూ.23,997 కోట్లు ( 2021-22 ఏప్రిల్ - అక్టోబర్ వరకు )

గుజరాత్ : రూ.7,789 కోట్లు 

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ జీతాల బిల్లు : 24, 681 కోట్లు 

(2018–19లో ఉద్యోగుల జీతాలు,పెన్షన్ల చెల్లింపులకు రూ.53,811 కోట్లు )

2020-21లో ఉద్యోగుల జీతాలు,పెన్షన్ల చెల్లింపులకు రూ.66,470 కోట్లు )

ఇన్ని సమస్యలు.. చంద్రబాబు వదిలేసి వెళ్లిన జెన్- కో బిల్లులు, కాంట్రాక్టర్ల బిల్లుల వంటివి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ప్రజలకు వివిధ పథకాల ద్వారా నేరుగా రూ.2.20 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లోకి జమచేశారు. 

AP BJP President Purandeswari Comments on YCP government

purandeswari