ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్ నుంచి సాయి పల్లవి అవుట్, ఆమె స్థానంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ రాబోతుంది అంటూ కొన్ని వార్తలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాని కమ్మేశాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్ లో సాయి పల్లవి ని సుబ్భలక్ష్మి పాత్రకు ఎంచుకున్నారనే ప్రచారం జరుగుతుంది.
కానీ ఇప్పుడు సడన్ గా సాయి పల్లవి హిందీ రామాయణ, ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్ కోసం డేట్స్ కేటాయించడం కష్టమవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అందుకే ఆమె ప్లేస్ లోకి రుక్మిణి వసంత్ ని సంప్రదిస్తున్నారనే ప్రచారం మొదలైంది.
అయితే రుక్మిణి ని ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్ కోసం సాయి పల్లవి స్థానంలోకి తీసుకున్నారనే వార్తల్లో నిజం లేదట. సాయి పల్లవి నే ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్ లో నటించబోతుంది అని సమాచారం. ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ సమ్మర్ తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది.





ఆ డేట్ పై కన్నేసిన అఖిల్ లెనిన్
Loading..