రెండురోజులుగా ప్రముఖ హీరో అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి ముంబై కి షిఫ్ట్ అవుతున్నాడు, ఆయన తన ఫ్యామిలీని తీసుకుని ముంబై కి వెళ్ళిపోతున్నాడు.. అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న రాకా మూవీ షూటింగ్ కోసం అల్లు అర్జున్ కుటుంబాన్ని తీసుకుని ముంబై షిఫ్ట్ అవుతున్నాడనే వార్త సంచలనంగా మారింది.
అయితే అల్లు అర్జున్ ముంబై కి మూవ్ అవ్వడం పై ఆయన తండ్రి నిర్మాత అల్లు అరవింద్ షాకింగ్ రిప్లై ఇచ్చారు. అల్లు అర్జున్ రాకా కోసమే ముంబై లో ఉంటున్నాడు, అందుకే ఇలాంటి వార్తలు పుడుతున్నాయి. ఆయన ఫ్యామిలీతో ముంబై కి షిఫ్ట్ అవుతున్నాడనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. హైదరాబాద్ లోనే సొంత ఇల్లు ఉంది.
పిల్లలు హైదరాబాద్ లోనే చదువుకుంటున్నారు. ఫ్రెండ్స్, బందువులు హైదరాబాద్ లో ఉండగా అల్లు అర్జున్ ఎందుకు ముంబై లో పర్మినెంట్ గా సెటిల్ అవ్వాలనుకుంటాడు.. ప్రస్తుతం అల్లు అర్జున్ రాకా షూటింగ్ కోసమే ముంబై లో ఉంటున్నాడు తప్ప ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యే ఉద్దేశ్యం లేదు అని ఆయన తేల్చి చెప్పారు.




చందమామ కు బాలయ్య ఛాన్స్
Loading..