హీరోయిన్ త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది, హీరో విజయ్ TVK పార్టీలో జాయిన్ కాబోతుంది.. ఆమెకు విజయ్ తో పెళ్లి కూడా జరగబోతుంది. అందుకే విజయ్-సంగీత కోర్టు కెళ్లారు విడాకుల కోసం అంటూ ఇలా త్రిష పై చాలారకాల వార్తలు వినబడుతూనే ఉన్నాయి. అలాగే ఆమె కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవట్లేదు. కారణం విజయ్ నే అంటూ రకరకాల వార్తలు ప్రచారం లోకి వచ్చాయి.
తాజాగా ఈ రూమర్స్ పై త్రిష మాస్ వార్నింగ్ ఇచ్చింది. తనపై నెగిటివిటి స్ప్రెడ్ చేసే వారికి త్రిష కౌంటర్ వేస్తూ.. నేను సినిమాలకు గుడ్బై చెప్పేశానట.. అంతేకాదు ఓ రిచ్ బిజినెస్మెన్ను పెళ్లి చేసుకున్నానట.. అందుకు సాక్ష్యంగా మాకు పుట్టిన నలుగురు పిల్లలకు నిన్నే రెండేళ్లు కూడా నిండాయట.
ఇవి సరిపోతాయా.. లేదంటే ఇవి కాకుండా ఇంకేమైనా కొత్తవి జత చేయాలా.. లేదంటే ఈ రోజుకి ఈ కల్పిత వార్తల కోటా పూర్తయిందా అంటూ త్రిష తనపై వస్తున్న రూమర్స్ పై అగ్గిమీద గుగ్గిలమవుతూ సోషల్ మీడియాలో రూమర్స్ రాయుళ్లకు మాస్ కౌంటర్ ఇచ్చింది.




డెకాయిట్ ప్రీ రిలీజ్ బిజినెస్ 

Loading..