మన శంకర వర ప్రసాద్ గారు సక్సెస్ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని తనకు అచ్చొచ్చిన హీరోలు వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటుగా పలు సినిమా ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళుతున్న అనిల్ రావిపూడి గత రాత్రి LIK ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లారు.
అక్కడ ఆ ఈవెంట్ లో కృతి శెట్టి గురించి మట్లాడుతూ.. తన సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి ని కళ్యాణ్ రామ్ కోసం ఫిక్స్ చేసినట్టుగా రివీల్ చేసారు. గత కొద్దిరోజులుగా అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి, కీర్తి సురేష్ లు హీరోయిన్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. అన్నట్టుగానే కృతి శెట్టి ని ఫిక్స్ చేసారు అనిల్ రావిపూడి.
కళ్యాణ్ రామ్ కి గర్ల్ ఫ్రెండ్ దొరికేసింది, మరి కీర్తి సురేష్ కూడా మరో హీరోయిన్ గా ఓకే అవుతుందా, లేదా అనేది తెలియాల్సి ఉంది. అనిల్ రావిపూడి-వెంకటేష్-కళ్యాణ్ రామ్ చిత్రం జూన్ నుంచి పట్టాలెక్కనుంది. 2027 సంక్రాంతి కి టార్గెట్ ఫిక్స్ చేసారు అనిల్ రావిపూడి.




విశ్వంభర మేకర్స్ పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Loading..