సెలబ్రిటీస్ అయినా, లేదంటే ఫుడ్ ని ఎంజాయ్ చెయ్యాలనుకునేవారు ఎవరైనా ఆ ఫుడ్ ఎక్కడ బావుంటుందో, ఎక్కడ సరదాగా ఫుడ్ ని ఎంజాయ్ చెయ్యొచ్చో అని చూసుకుని మరీ రెస్టారెంట్ కి వెళుతూ ఉంటారు. అది ఎంత కాస్ట్లీ అయినా సరే అస్సలు లెక్క చెయ్యరు. ఇప్పుడు ముంబై లోని ఫేమస్ శిల్పా శెట్టి రెస్టారెంట్ బాస్టియన్ కి వెళితే ఆస్తులమ్ముకోవాలనంటున్నారు సదరు కష్టమర్స్.
ముంబైలో ఎంతో విలాసవంతమైన రెస్టారెంట్ శిల్పా శెట్టి నడిపిస్తున్న బాస్టియన్ రెస్టారెంట్. అద్భుతమైన వాతావరణం, అంతకుమించి అదిరిపోయే సీ ఫుడ్ అందించడం ఆ రెస్టారెంట్ ప్రత్యేకత. అందుకే చాలామంది సెలబ్రిటీలు, వ్యాపారావేత్తలు ఆ రెస్టారెంట్ కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. విలాసవంతమైన ప్రదేశం కాబట్టి అక్కడి ఫుడ్ ధరలు కూడా ప్రీమియంగానే ఉంటాయి.
ఓ నలుగురు బాస్టియన్ రెస్టారెంట్ కి ఫుడ్ తినేందుకు వెళితే.. వారికి ఏకంగా రూ.21,731 బిల్ అయినట్లుగా సదరు మెంబెర్స్ ఆ బిల్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఆ బిల్ లో చికెన్ న్యూడిల్స్ ధర రూ. 950 ఉండటం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంతేకాదు ఫ్రెంచ్ ఫ్రైస్ ధర ఏకంగా రూ.1450 ఉండటంతో .. శిల్పా శెట్టి రెస్టారెంట్ కి వెళితే ఆస్తులు అమ్ముకోవాలంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.




దసరా నుంచి తప్పుకుంటున్న ప్రభాస్ ఫౌజీ
Loading..