బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కెరీర్ పీక్స్ లో ఉండగానే ఓ బిడ్డకు తల్లై అందరికి షాకిచ్చింది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటూ కొన్నేళ్లుగా బాలీవుడ్ భామలు నిరూపిస్తున్నారు.
అయితే తల్లిగా మారక కొన్ని నెలలు కియారా అద్వానీ బిడ్డ సంరక్షణలో ఉంది. ఇక ఇప్పుడు కియారా మళ్లీ తన పాత లైఫ్ స్టయిల్ ని ఫాలో అవుతుంది. అంటే సినిమాలు, షూటింగ్స్, స్పెషల్ ఫోటో షూట్స్ అంటూ నిత్యం బిజీగా కనిపిస్తుంది. తాజాగా కియారా అద్వానీ ఓ ఇంటర్వ్యూలో తల్లయ్యాక తన లైఫ్ లో ఎలాంటి మార్పు వచ్చిందో చెప్పుకొచ్చింది.
అమ్మనయ్యాక జీవితాన్ని చూస్తే నా కోణం పూర్తిగా మారిపోయింది. నేను ఇప్పుడు ఒక ఆడపులిలా మారాను, బిడ్డను రక్షించాలనే భావనతో తాను మరింత బలంగా, జాగ్రత్తగా మారానని కియారా వివరించింది. మరి సహజంగా ప్రతి తల్లి తన బిడ్డ సంరక్షణలో ఓ ఆడపులే. బిడ్డ సంరక్షణ, ఇటు బిడ్డను కాపాడుకోవడంలో స్త్రీ కి ఎవరూ సాటిరారు. అదే విషయం కియారా చెప్పింది.




పెద్ది వాయిదా తప్పదా..
Loading..