తమిళనాడు ఎన్నిలకు సమీపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ కి ఏప్రిల్ 23 న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి తమిళనాట రాజకీయంగా చాలా రసవత్తర పోటీ ఉండబోతుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ TVK పార్టీ ఈ ఎన్నికల్లో స్టాలిన్ ప్రభుత్వాన్ని ఢీ కొట్టబోతుంది. మరోపక్క అన్నాడీఎంకే కూటమి కట్టింది.
ఈ ఎన్నికల్లో ప్రముఖ దర్శకుడు సుందర్ సి పోటీ చెయ్యబోతున్నారు. మధురై సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన PNK పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే సుందర్ సి అన్నాడీఎంకే పార్టీ గుర్తు మీదే పోటీ చేయనున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే ఆయన అన్నాడీఎంకే కూటమి తరుపున పోటీ చేస్తున్నారు.
ఇక సుందర్ సి భార్య, ప్రముఖ నటి ఖుష్బూ బిజెపి నేత. కుష్బూ భర్త సుందర్ సి పోటీపై స్పందిస్తూ.. ఆయన ఇప్పటివరకు సినిమా కెరీర్లో ముప్పైఏళ్ళకు పైగా ప్రజలు మద్దతుగా నిలిచారని, అందుకే ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన పోటీ చేస్తున్నారని, ఆయన నిర్ణయానికి సుందర్ భార్యగా గర్వపడుతున్నానని ఆమె తెలిపారు.




వీకెండ్ ని క్యాష్ చేసుకోలేకపోతున్న ఉస్తాద్ 

Loading..