తమిళనాట డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ మాములుగా రాలేదు. అయితే హ్యాట్రిక్ విజయలతో ఉన్న ఈ కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన LIK చిత్రం విడుదల విషయంలో గందరగోళం నెలకొంది. నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పలుమార్లు విడుదల వాయిదా పడింది.
గత ఏడాది దివాళికి విడుదల అన్నారు, ఆతర్వాత డిసెంబర్ అన్నారు. కాదు ఫిబ్రవరి 14 అన్నారు. ఇప్పుడు ఏప్రిల్ లో విడుదల అన్నా ఆ విధంగా ఎలాంటి సౌండ్ LIK నుంచి వినిపించడం లేదు. కారణం LIK చిత్ర నిర్మాతలు ప్రదీప్ రంగనాథన్ కి చెల్లించాల్సిన పారితోషికం పూర్తిగా చెల్లించలేదనే న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
హీరో ప్రదీప్ రంగనాథన్ ఇవ్వాల్సిన పారితోషికం విషయంలో తలెత్తిన వివాదమే ఈ సినిమా ఇన్నిసార్లు వాయిదా పడడానికి కారణమని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ కూడా ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ పక్కన పడేసి ఇతర ప్రాజెక్ట్స్ పై ఫోక్డస్ పెట్టాడట.




మతిపోగోట్టే భంగిమలో కియారా అద్వానీ 
Loading..