హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మార్చ్ 19 న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై ట్రేడ్ లోనే కాదు అభిమానుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వదులుతున్న సాంగ్స్, ట్రైలర్ టీస్ సినిమాపై అంచనాలు పెంచేసాయి.
తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ పూర్తయ్యింది. ఈచిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ టాక్ చూస్తే సినిమాకి హిట్ కళ కనిపిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంటర్వెల్ అలాగే సెకండ్ హాల్ఫ్ ఇంకా పాటలు మెయిన్ హైలెట్ గా నిలవబోతున్నాయని, యాక్షన్ సీక్వెన్స్ లో పవన్ అద్దరగొట్టేశారని సమాచారం.
హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని చాలా స్టైలిష్ గా ఇంట్రడ్యూస్ చెయ్యబోతున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు.




ఇండియా నుంచి మొట్ట మొదటి చిత్రమిదే!
Loading..