ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Producer raised hype for NTRNeel Project

డ్రాగ‌న్ .. మీ ఊహ‌కే వ‌దిలేస్తున్నాం

Producer raised hype for NTRNeel ProjectProducer raised hype for NTRNeel Project

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ దర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్ `డ్రాగ‌న్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. హోంబ‌లే ఫిలింస్ నిర్మించిన `కాంతార చాప్ట‌ర్ 1` సినిమాని నైజాంలో రిలీజ్ చేస్తోంది మైత్రి. ఈ సంద‌ర్భంగా కాంతార 1 ప్ర‌చార వేదిక‌పై మైత్రి మూవీ మేక‌ర్స్ ర‌విశంక‌ర్ మాట్లాడుతూ .. కార్య‌క్ర‌మానికి అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్, రిష‌బ్ మ‌ధ్య స్నేహం గురించి మాట్లాడారు. అలాగే  న‌టులుగా ఆ ఇద్ద‌రి ప‌నిత‌నాన్ని ప్ర‌శంసించారు.

ఇంత‌లోనే వేలాదిగా కాంతార చాప్ట‌ర్ 1 ప్రీరిలీజ్ వేడుక‌కు విచ్చేసిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌ను ఉద్ధేశించి ర‌విశంక‌ర్ మాట్లాడారు. ఎన్టీఆర్ న‌టిస్తున్న సినిమా(డ్రాగ‌న్ తాత్కాలిక టైటిల్) కొత్త షెడ్యూల్ వ‌చ్చే నెల‌లో ప్రారంభ‌మ‌వుతుంద‌ని ర‌విశంక‌ర్ వెల్ల‌డించారు. ``శ‌ర‌వేగంగా సినిమాని పూర్తి చేస్తున్నాం. ఈ సినిమా ఎలా ఉంటుందో అభిమానుల ఊహ‌కే వ‌దిలేస్తున్నాం.

మీ అంచ‌నాల‌ను మించి ఉంటుంది.. అది వేరే లెవ‌ల్`` అంటూ డ్రాగ‌న్ సినిమాపై ర‌విశంక‌ర్ హైప్ ని అమాంతం పెంచేసారు. కాంతార 1 ప్ర‌చార వేదిక‌పై ప్ర‌శాంత్ నీల్ మిస్స‌య్యార‌ని, ఆయ‌న వ్య‌క్తిగ‌త ప‌ని మీద వేరొక చోటికి వెళ్లాల్సి వ‌చ్చింద‌ని కూడా మైత్రి ర‌విశంక‌ర్ తెలిపారు.

హైద‌రాబాద్ లో జ‌రిగిన కాంతార చాప్ట‌ర్ 1 ప్రీరిలీజ్ వేడుక‌లో ఎన్టీఆర్, రిష‌బ్ శెట్టి, ర‌విశంక‌ర్, రుక్మిణి వ‌సంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

NTRNeel is going to be a different level film

ntrneel