సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రీసెంట్ చిత్రం కుబేర సూపర్ హిట్ అయ్యింది. ధనుష్ దేవా పాత్రలో బిచ్చగాడిగా అద్భుతమైన పెరఫార్మెన్స్ ఇవ్వగా, నాగార్జున మాజీ సీబీఐ అధికారిగా అద్దరగొట్టేసారు. రష్మిక తన పాత్రలో ఒదిగిపోయి నటించడం, శేఖర్ కమ్ముల దర్శకత్వం, నిర్మతలు పెట్టిన పెట్టుబడి, దేవిశ్రీ మ్యూజిక్ అన్ని కుబేర సక్సెస్ లో భాగమయ్యాయి.
ఇక లవ్ స్టోరీ తర్వాత డిఫ్రెంట్ కథాంశంతో శేఖర్ కమ్ముల కుబేర చిత్రాన్నితెరకెక్కించారు. కుబేర సక్సెస్ తో శేఖర్ కమ్ముల మళ్ళీ ఎలాంటి కథతో వస్తారు, ఎటువంటి బ్యాక్ డ్రాప్ ని ఎంచుకుంటారు అనే విషయంలో చాలామంది క్యూరియాసిటీగా కనిపిస్తున్నారు. తాజాగా కుబేర తర్వాత శేఖర్ కమ్ముల చెయ్యబోయే తన తదుపరి ప్రాజెక్ట్ పై ఆయన రియాక్ట్ అయ్యారు.
తన తదుపరి చిత్రం ప్యూర్ లవ్ స్టోరీగా ఉండబోతుంది, కుబేరను కాస్త ఆవేశంగా సామజిక స్పృహాతో తీసిన నేను ఈసారి మంచి లవ్ స్టోరీనే తీస్తాను, నన్ను నేను రివైండ్ చేసుకుంటాను, నేను ఎంత టైమ్ తీసుకున్నా నా నుంచి స్పెషల్ మూవీనే వస్తుంది. అది ప్రేమ కథే అయ్యి ఉంటుంది. కాకపోతే దానికి కొంచెం టైమ్ పడుతుంది అంటూ శేఖర్ కమ్ముల తన తదుపరి మూవీ ఎలా ఉండబోతుందో రివీల్ చేసారు.