సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో స్టార్ నటులు ధనుష్-నాగార్జున-రష్మిక కలిసి నటించిన కుబేర జూన్ 20 న పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ ప్రమోషన్స్ లేకపోయినా. ఇంట్రెస్టింగ్ ఇంటర్వూస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన కుబేర చిత్రానికి సంబందించిన ఓవర్సీస్ షోస్ పూర్తి అవడంతో అక్కడి ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
కుబేర ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. ధనుష్ కనిపించిన ప్రతీ సీన్ను శేఖర్ కమ్ముల బాగా ఎలివేట్ చేశారు. రా అండ్ రస్టిక్ పాత్రలో ధనుష్ అద్బుతమైన పెర్ఫార్మెన్స్ను ఇచ్చాడు. పాత్ర కోసం ప్రాణం పెట్టాడు. ఆ పాత్రలో ఆయన జీవించాడు. నాగార్జున లుక్స్ విషయంలోనే కాదు స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకొన్నారు. రష్మిక అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్.. అంటూ కొంతమంది ఆడియన్స్ కామెంట్ చేసారు.
కుబేర స్టార్టింగ్ స్లోగా మొదలైంది.. కానీ ధనుష్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా ఒక హై ఇచ్చిందని, కథ నుంచి బయటకు వెళ్లకుండా శేఖర్ కమ్ముల కట్టిపారేసారు, ఇంటర్వెల్ తర్వాత వచ్చే నాలుగైదు ఎమోషనల్ సీన్లు మన టికెట్ డబ్బులకు సరిపడా కంటెంట్ ఇస్తాయని ఓవర్సీస్ ఆడియన్స్ ఘంటాపధంగా ట్వీట్లు పెడుతున్నారు.
నాగార్జున, ధనుష్, రష్మిక ఇలా ప్రతి ఒక్క పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది, మరోసారి శేఖర్ కమ్ముల హార్ట్ టచ్చింగ్ మూవీ ని ప్రేక్షకులకు అందించారు, దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్తో సూపర్బ్గా తన జాబ్ చేశాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఎటు చూసినా కుబేరకు పాజిటివ్ రివ్యూస్, పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇండియాలోని షోస్ కూడా స్టార్ట్ అయ్యాయి. మరి ఇక్కడి కుబేర రివ్యూస్ ఎలా ఉండబోతున్నాయో మరికాసేపట్లలో...