నాగ చైతన్య-సమంత విడిపోయాక వారిద్దరూ కలిసిపోవాలని అభిమానులు ఎంతగా కోరుకున్నారో, ఆఖరికి కలవాలని పూజలు కూడా చేసారు. అది జరగకపోయేసరికి వారిద్దరిని ఒకే స్క్రీన్ పై చూడాలని, ఒకే స్టేజ్ పై చూడాలని చాలామంది అభిమానులు ఆశపడ్డారు. కానీ ఇంతవరకు చైతు-సమంత డివోర్స్ అయ్యాక ఫేస్ టు ఫేస్ కలిసింది లేదు. సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ పోస్ట్ లు తప్ప ఒకరిపై ఒకరు నిందలు కూడా వేసుకోలేదు.
అయితే రీసెంట్ గా నాగ చైతన్య-సమంత ఒకే వేదికపై కలిసే అవకాశం వచ్చింది అంటూ ప్రచారం జరుగుతుంది. నాగ చైతన్య-సమంతల కెరీర్ లో ఆరంభంలో కీలకంగా నిలిచిన ఏ మాయ చేసావే చిత్రం వచ్చే నెల 18 న రీ-రిలీజ్ అవుతుంది. ఆ సందర్భంగా చైతు-సమంతలు కలిసి ఏమాయ చేసావే చిత్రాన్ని ప్రమోట్ చేస్తారని ప్రచారం హోరందుకుంది. అయితే ఈ రూమర్స్ పై సమంత ఫుల్ గా క్లారిటీ ఇవ్వడమే కాదు చైతు తో కలిసే సమస్యే లేదంటుంది.
తను ఏమాయ చేసావే చిత్రాన్ని ప్రమోట్ చెయ్యడం లేదని చెప్పింది, ఈ వార్తలు ఎక్కడనుండి పుడుతున్నాయో అర్ధం కావడం లేదు.. ఆ సినిమాలో నటించిన జంటను కలిసి చూడాలని ప్రేక్షకులకు ఇష్టం ఉండొచ్చు. కానీ ప్రేక్షకుల కోసం మేము జీవించలేం కదా అని సమంత నాగ చైతన్య తో కలిసి ఒకే వేదికపై కనిపించవచ్చనే రూమర్స్ కి స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది.