యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న యంగ్ బ్యూటీ తన పారితోషికాన్ని అమాంతం పెంచేసింది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సప్తసాగరాలు దాటి తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ భామ రుక్మిణి వసంత్ ఆ తర్వాత హీరో నిఖిల్ తో అపుడో ఇపుడో ఎపుడో చిత్రంలో నటించింది, అది పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఆ తర్వాత రుక్మిణి వసంత్ ని ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) లో హీరోయిన్ గా వరించింది అనే వార్త తెగ వైరల్ అయ్యింది.పెద్దగా హిట్స్ లేని రుక్మిణి వసంత్ కి ఎన్టీఆర్ చిత్రంలో అవకాశం దొరకడం ఆమె అదృష్టం అంటూ అందరూ ఆమెని తెగ పొగిడేసారు.. ఇంకా అధికారికంగా ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ లో రుక్మిణి వసంత్ నటిస్తుంది అనేది కన్ ఫర్మ్ గా రాలేదు.
ఈలోపే రుక్మిణి వసంత్ కు టాలీవుడ్ యంగ్ హీరోలు ఆఫర్స్ ఇస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆమె రెమ్యునరేషన్ సైతం పెంచినట్లుగా టాక్. ఒక్కో సినిమాకు దాదాపుగా రూ.3 కోట్ల వరకు పారితోషికం ఛార్జ్ చేస్తుంది అని సమాచారం. ఇప్పుడిదే ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.