భారతీయ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఏది? అంటే... సౌత్, నార్త్ లో మల్టీస్టారర్ల ట్రెండ్ కొనసాగుతున్న ఈ తరుణంలో భారతదేశంలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ బాలీవుడ్లో తెరకెక్కేందుకు ఆస్కారం ఉంది. ఇంతకుముందు ఖాన్ల త్రయం దీనిని ప్రకటించింది. అమీర్ ఖాన్- సల్మాన్ ఖాన్- షారూఖ్ ఖాన్ కలిసి నటించే ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇటీవలి కాలంలో పఠాన్, టైగర్ 3లో సల్మాన్, షారూఖ్ కలిసి కనిపించారు. కానీ ముగ్గురు ఖాన్ లు కలిసి నటించే అవకాశం ఇంతకాలం రాలేదు. ఆ అరుదైన దృశ్యం చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు.
కొన్ని నెలల క్రితం పఠాన్, టైగర్ 3 విడుదల సమయంలో దీనిని ఖాన్ ల త్రయం ప్రకటించింది కూడా. కానీ ఎందుకనో ఇప్పటికీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ రాలేదు. అయితే తాజా ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. సల్మాన్, షారూఖ్ లతో నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని, కానీ కథ ఇంకా దొరకలేదని అన్నారు.
అలాగే దర్శకుడిని కూడా ఇంకా కనుగొనలేకపోయామని తెలిపాడు. దీనిని బట్టి ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ కెళ్లేందుకు ఛాన్స్ లేదు. ప్రస్తుతం ఈ ముగ్గురూ వరుస చిత్రాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయ్యేందుకు ఇంకో రెండేళ్లు పడుతుంది. అంటే 2028 వరకూ భారతదేశంలోని బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు!